ఘనంగా కెవి కేశవులు వర్ధంతి వేడుకలు

Published: Tuesday January 31, 2023

జన్నారం, జనవరి 30, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సోమవారం బీసీ సంఘాల నాయకుడు కేవీ కేశవులు 5వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ కులాల ఐక్య పోరాట సంఘం కరీంనగర్ జోన్ కన్వీనర్ కేవీ నరసింహులు మండల కేంద్రంలో విలేకరులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కె.వి కేశవులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండలంలోని అక్కపల్లిగూడెం గ్రామ వాస్తవ్యులు స్వాతంత్ర్య సమరయోధులు సిర్పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు కెవి కేశవులు గారి పదవులు కొనసాగించారు. నియోజకవర్గ ఎమ్మెల్యేగా అతను పేద ప్రజలకు చేసిన సేవలు మరువలేనివిన్నారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల బీసీ నాయకులు ప్రెస్ క్లబ్ వద్దకు హాజరై కేవి కేశవులు ఆశ్రయ సాధన కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు కోడూరు చంద్రయ్య, మామిడి విజయ్, అడేపు సత్యనారాయణ, కాడెర్ల నరసయ్య, మూల భాస్కర్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.