సేవా సదనం లో అన్న దానం

Published: Thursday May 19, 2022
మధిర మే 18  ప్రజా పాలన ప్రతినిధి
 మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక  Dr. వసంతమ్మ మానసిక వికలాంగ కేంద్రం లో పిల్లలకు నందిగామ నివాసి హై కోర్ట్ సీనియర్ న్యాయవాది దివంగత పాస్టర్ తాటి శశిధర్ జ్ఞాపకార్ధ సందర్బంగా ప్రముఖ సామజిక సేవకులు లంకా కొండయ్య, ట్రైబల్ ఏవంజలిస్ట్ రాష్ట్ర డైరెక్టర్ పాస్టర్ ఎన్. బాబురావు ఆధ్వర్యంలో శశిధర్ కుటుంబికులు బ్యాంక్ ఉద్యోగి శ్రీ తాటి శ్రీధర్, హైదరాబాద్ యాడ్ ఏజెన్సీ నిర్వాహకులు నర్సింహారావు, చిలుకూరి శ్రీనివాస రావు, శశిధర్ సతీమణి లక్ష్మి, కుమారుడు హర్ష వర్ధన్ చేతులు మీదుగా అన్న దానం జరిగింది అదే విధంగా మండలం లో వున్నా ముగ్గురు వితంతువు మహిళలకు దీర్ఘ కాలక అనారోగ్యం తో బాధ పడుతున్న కుటుంబికులుకు ఒక నెలకు సరిపడా నిత్య అవసర సరుకులు అందించారు. ఈ సందర్బంగా సంస్థ నిర్వాహకులు Dr. షీలా అన్న దానం చేసిన నిర్వాహకులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో సేవా సదానం సిబ్బంది నారి కుమార్, కరుణ, సన్నీ, ఆదర్ష, యశశ్రీ, సంధ్య పాల్గొన్నారు.