*అన్నదానం మహాదానం** *అత్తెల్లి జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం*

Published: Tuesday February 21, 2023


చేవెళ్ల ఫిబ్రవరి 20, (ప్రజాపాలన):-

అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. సోమవారం శ్రీ లక్ష్మీవెంకటేశ్వర దేవస్థానం పుష్కరిణి ఆవరణలో మహా శివరాత్రి జాతరకు వచ్చే భక్తుల కోసం చేవెళ్ల వాస్తవ్యులు అత్తెల్లి జగన్నాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎంపీపీ విజయలక్ష్మిరమణారెడ్డి, జడ్పీటీసీ మర్పల్లి మాలతికృష్ణారెడ్డి చేవెళ్ల సర్పంచి శైలజ ఆగిరెడ్డి, పిఎసిఎస్ చైర్మన్  దేవర వెంకట్ రెడ్డి, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ....అన్నిదానాల్లో అన్నదానం గొప్పదని, ఇలాంటి మంచి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టి ఆకలి తీర్చడం గొప్ప పుణ్యకారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని తెలిపారు. జాతరకు వచ్చిన వేలాది మంది ఆకలి తీర్చిన అత్తెల్లి జగన్నాథ్ రెడ్డిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో బి.ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, సబ్ రిజిస్ట్రార్ విష్ణవర్ధన్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కేశపల్లి వెంకట్ రామ్ రెడ్డి, నాయకులు హరిలాల్, అత్తెల్లి రమణారెడ్డి,  గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, గుడిపల్లి శ్రీకర్ రెడ్డి అత్తిలి రాఘవేందర్ రెడ్డి శ్రీకాంత్, జయంత్,