బదిలీపై వెళ్తున్న డాక్టర్ కు వీడ్కోలు తెలిపిన హాస్పటల్ సిబ్బంది

Published: Thursday August 25, 2022
బెల్లంపల్లి ఆగస్టు 24 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆస్పత్రిలో పథాలజిస్టు గా పనిచేసి, బదిలీపై గోదావరిఖని ఏరియా ఆస్పత్రికి బదిలీపై వెళ్తున్న డాక్టర్ విష్ణుమూర్తిని హాస్పిటల్ సిబ్బంది బుధవారం నాడు ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడుతూ, ఆయన గతంలో మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో మంది తల సేమియా వ్యాధిగ్రస్తులకు, ఎనీమియా రోగులకు, గర్భిణీ స్త్రీలకు, క్యాంపులు ఏర్పాటు చేసి దాతల ద్వారా రక్తాన్ని సేకరించి, ఎంతో మంది ప్రాణాలను కాపాడారని పలువురు ప్రశంసించారు. 
 
ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డి వై సీఎంవో, డాక్టర్ శౌరి, పలువురు డాక్టర్లు , క్లర్కులు, స్టాఫ్ నర్సులు, వార్డ్ అసిస్టెంట్లు, జనరల్ మజ్దూర్లు, స్కావెంజర్లు, తదితర సిబ్బంది పాల్గొన్నారు.