కరోనాతో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండండి : కార్పొరేటర్ శ్రీవిద్య చక్రపాణి గౌడ్

Published: Friday May 21, 2021
మేడిపల్లి, మే20 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనాతో అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ కొత్త శ్రీవిద్య చక్రపాణి గౌడ్ ప్రజలకు సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తి రెండోదశలో విజృంభిస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కార్పొరేటర్ శ్రీవిద్య చక్రపాణి గౌడ్ డివిజన్లోని  హేమానగర్, లక్ష్మీ గణపతి, తిరుమల మిడోస్ కాలనీల్లో సోడియం హైపో క్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ డివిజన్లో  కరోనా సోకిన వారికి తగు జాగ్రత్తతలు, సూచనలు ఇస్తున్నాారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్  నాయకులు కొత్త చక్రపాణిగౌడ్, గడుసు జగదీశ్వర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు రామకృష్ణ, కాలనీ అధ్యక్షుడు సంతోష్ రెడ్డి, సిరిముళ్ళ శ్రీనివాస్, గోపి, సత్తయ్య, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు.