హిమ్మత్ రావు పేట్ లో గర్భిణీ మహిళలకు శ్రీమంతం
Published: Friday December 10, 2021
కొడిమ్యాల, డిసెంబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం లోని హిమ్మత్ రావు పేట్ గ్రామంలో అంగన్వాడీ సెంటర్ లో గ్రామసర్పంచ్ పునుగోటి కృష్ణారావు ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించి వివిధ రాకలైన పండ్లు, కోడిగుడ్లు, పాలు అందించారు. కృష్ణారావు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పౌష్టిక ఆహారం తీసుకుంటు వైద్యలు సూచించిన జాగ్రత్తలు పాటిస్తూ వ్యాయామం చేయాలనీ సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పునుగోటి కృష్ణారావుతో పాటు, డాక్టర్ నవనీత, ఏఎన్ఏం పద్మ, అంగన్వాడీ టీచర్ లు సుశీల, రాజమణి, ఆశసిబ్బంది రజిత, వసంత తదితరులు మహిళలు పాల్గొన్నారు.
Share this on your social network: