ఎమ్మెల్సీ ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ దిశానిర్దేశం

Published: Tuesday March 02, 2021
బాలాపూర్: ప్రజాపాలన న్యూస్; పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం లోని మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో స్వాగత్ గ్రాండ్ హోటల్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో దశ నిర్దేశించిన కార్యక్రమానికి మంత్రులు తన్నీరు హరీష్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరైనారు. మహేశ్వరం నియోజకవర్గం లో, మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో టిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి సురభి వాణి దేవి గారిని గెలిపించాలని పార్టీ ప్రజా ప్రతినిధులను  నాయకులను కార్యకర్తలను విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రా రెడ్డి, మంత్రి హరీష్ రావు కార్యకర్తలందరికీ దశ నిర్దేశించారు. టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు టిఆర్ఎస్ శ్రేణులు అందరూ సురభివాణి దేవి ని కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లపార్లమెంట్ సభ్యుడు డాక్టర్ రంజిత్ రెడ్డి, జిల్ల పరిషిత్ చైర్మన్ తీగల అనితా రెడ్డి, మాజీ శాససభ్యుడు తీగల కష్ణారెడ్డి, కొత్త మనోహర్ రెడ్డి, కప్పటి పాండు రంగారెడ్డి, మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహాన్, బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింతా పారిజాత నరసింహారెడ్డి, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధల  లావణ్య బీరప్ప, ఆరకాల భూపాల్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కామేష్ రెడ్డి, మహేశ్వరం నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు బండి మీనా నగేష్ యాదవ్, ఇతర డివిజన్ల, మండలాల మున్సిపల్ కార్పొరేషన్ల అధ్యక్షులు, టిఆర్ఎస్ పార్టీ బీసీ సెల్, ఎస్సీ సెల్, మైనారిటీ సెల్ ఎస్టీ సెల్, టిఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు, కో ఆప్షన్ సభ్యులు, యువజన విభాగం అధ్యక్షులు మరియు ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు  పెద్ద సంఖ్యలు తదితరులు పాల్గొన్నారు.