కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్టు

Published: Thursday February 17, 2022

కోరుట్ల, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన ప్రతినిధి): అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుతూ బుదవారం రోజున జిల్లా ఎస్ పి కార్యాలయాల ముట్టడికి పి.సి.సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కోరుట్ల నియోజక వర్గ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగరావుల పిలుపు మేరకు బయలు దేరుతుండగా కోరుట్ల పోలీసులు ముందస్తు అక్రమ అరెస్ట్లు చేయడంతో కాంగ్రెస్ పార్టి పోరాటాలను అడ్డుకోలేరని నాయకులు తెలిపారు. అరెస్ట్ అయినవారిలో బోయినిపెల్లి సత్యం రావు, కొంతం రాజం, తిరుమల గంగాధర్, చిటిమెల్లి రంజిత్ గుప్తా, ఏలేటి మహిపాల్ రెడ్డి, తుపాకుల బాజన్న, పన్నాల అంజిరెడ్డి, అక్బర్, పోట్ల ఉపేందర్, ఆన్వార్ మొహ్మద్, మొహ్మద్ నబి, మరుపాక సుమన్, సరికెల్ల నరేష్, ఉట్ల సుధాకర్, తాటికొండ తరుణ్, తదితరులు ఉన్నారు.