మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక నిధులు వెచ్చిస్తుంది

Published: Saturday October 01, 2022
నవాబు పేట్ . ప్రజా పాలన ప్రతినిధి.30.  పీఏసీఎస్ అధ్యక్షుడు ,టీఆర్ఎస్ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు 
నవాబ్ పేట ..  కేంద్రంలో  మహిళా సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరు చేయడం జరుగుతుంది అని పీఏసీఎస్ అధ్యక్షుడు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు అన్నారు.శనివారం మహిళా సమాఖ్య మండల కమిటీ సమీక్ష సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు.టీఆరెస్ ప్రభుత్వం మహిళలకు రిజిస్ట్రేషన్ లు యాబై శాతం వరకు ఇచ్చింది అని అన్నారు.తక్కువ వడ్డీ తో రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుంది అని తెలిపారు.ఇక మున్ముందు మరింత అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం మహిళలకు చేయూత నిస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో యంపీపీ అనంతయ్య యంపీడీఓ శ్రీలత టీఆర్ఎస్ నాయకులు ప్రతాప్ ఏపీఎం, మహిళా కమిటి మండల అధ్యక్షురాలు అరుణమ్మ సీసీ లు ఆయా గ్రామాల మహిళా కమిటీ అధ్యక్షురాలు తదితరులు పాల్గొన్నారు.