ఎస్సి ఎస్టీ జిల్లా మానిటరింగ్ కమిటీ సభ్యునిగా టివి సూర్యం

Published: Monday February 22, 2021
జగిత్యాల, ఫిబ్రవరి 21 (ప్రజాపాలన): జగిత్యాల జిల్లా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ  సభ్యునిగా సీనియర్ పాత్రికేయుడు టివి సూర్యంను నియమించడంతో పలువురు పాత్రికేయులు పుర ప్రముఖులు ఆదివారం రోజున ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శనివారం టీవీ సూర్యంను నియమించగ శాలువాలతో పూలబోకేలతో సన్మానించారు. ఈ సందర్భంగా టీవీ సూర్యం మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీలపై జరుగుతున్న అన్యాయాలపై తక్షణమే స్పందించి వారికి తగిన న్యాయం జరిగేలా తనవంతు బాధ్యతగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీలో సభ్యుడిగా నియమానికి సహకరించిన ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ రవి, జిల్లాలోని ఇతర ప్రజా ప్రతినిధులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఎన్నం కిషన్ రెడ్డి కళాశ్రీ గుండేటి రాజు ఐజేయూ జిల్లా కార్యదర్శి బండ స్వామి టిపిసిసి ఆర్గనైజింగ్ కార్యదర్శి బండ శంకర్ బెజ్జంకి సంపూర్ణచారి ద్యావర సంజీవ్ రాజు వొల్లం మల్లేశం సిరిసిల్ల వేణుగోపాల్ మాన్యం రవి కుమార్ జమిల్ గడ్డల హరికృష్ణ కుమార్ గోలి కిట్టు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.