తె రా స తోనే అభివృద్ధి

Published: Tuesday May 31, 2022
మంచిర్యాల టౌన్, మే 30, ప్రజాపాలన : తెలంగాణ రాష్ట్ర సమితి తోనే అభివృద్ధి జరిగిందిని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన  మీడియా సమావేశం లో మాట్లాడారు. మంచిర్యాల జిల్లా అభివృద్ధి నీ చూసి ఓర్వలేకనే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు అసత్యపు ప్రచారాలు చేస్తున్నాడని విమర్శించారు. మంచిర్యాల జిల్లాలో 500 కోట్ల రూపాయ లతో మెడికల్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ మార్కెట్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్, రైల్వే అండర్ బ్రిడ్జి, సింగరేణి ప్రాంతంలో పట్టాల పంపిణీ ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమలు చేపట్టినట్లు తెలిపారు .మేము అభివృద్ధి వైపు ఉంటే మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు దోపిడి కబ్జాల వైపు నిలబడ్డాడని విమర్శించారు.
 తనపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెరాస నేతలు, తదితరులు పాల్గొన్నారు