సాగర్ నీటి సమస్యలపై జడ్పీ చైర్మన్ కు వివరించిన మండల నాయకులు

Published: Tuesday March 07, 2023

బోనకల్ మార్చి 6 ప్రజాపాలన ప్రతినిధి: బీఆర్ఎస్ మధిర పార్టీ కార్యాలయం లో బోనకల్లు మండలం నారాయణపురం గ్రామ రెవిన్యూ పరిధిలోని రైతులు సొసైటీ వైస్ చైర్మన్ కరివేద సుధాకర్ రావు, కాకాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సాగర్ కాలువ నీటి సమస్యలపై జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు ని కలిసి వారి సమస్యలను వివరించడం జరిగింది. వెంటనే స్పందించిన జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు నీటిపారుదల శాఖ ఎస్ ఈ తో మాట్లాడి మూడు రోజుల్లో చివరి భూముల వరకు నీళ్లు ఇప్పించి మొక్కజొన్న పంటలు ఎండిపోకుండా రైతులకు న్యాయం జరిగేలా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.