డంపింగ్ యార్డులో అభివృద్ధి పనులను పరిశీలించిన మేయర్ జక్క వెంకట్ రెడ్డి
Published: Friday June 18, 2021
మేడిపల్లి, జూన్17 (ప్రజాపాలన ప్రతినిధి) పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని డంపింగ్ యార్డును మేయర్ జక్క వెంకట్ రెడ్డి, కమిషనర్ శ్రీనివాస్, డిఈ శ్రీనివాస్, ఏఈ వినిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు బైటింటి ఈశ్వర్ రెడ్డి సందర్శించి జరుగుతున్న పనులను పరిశీలించారు. డంపింగ్ యార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మేయర్ జక్క వెంకట్ రెడ్డి అధికారులకు సూచించారు.
Share this on your social network: