ప్రైవేటు ఫీజులు..3 నెలల తరగతులకు 12 నెలల ఫీజు వసూలు
Published: Tuesday February 16, 2021
చెల్లించని వారికి బెదిరింపులు..
రెచ్చిపోతున్న ప్రైవేటు విద్యాసంస్థలు
ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా అధ్యక్షులు వడ్రాణపు మధు.. మధిర బోడేపూడి భవన్ నందు ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) సమావేశం నిర్వహించారు.. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు వడ్రాణపు మధు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ :- తొమ్మిది,పదో తరగతులకు ప్రత్యేక్ష బోధన నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడమే తరువాయి.. ప్రైవేటు విద్యాసంస్థలు దోపిడీకి తెరలేపి తరగతుల నిర్వహణ కంటే ఫీజుల నిర్వాహణ పైనే ఎక్కువ దృష్టి సారిస్తున్నాయి అన్నారు.. 9,10 తరగతుల విద్యార్థులు ఈ ఏడాది మొత్తం ఫీజు చెల్లించాల్సిందేనని విద్యాసంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.. అన్నారు పాఠశాలల్లోనూ కాదు ప్రైవేటు జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా సంస్థల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొంది మొదటి సెప్టెంబరు 1 నుంచి ఆన్లైన్ తరగతులకు ప్రభుత్వం అనుమతించింది.. దీనితో అయిదు నెలల ఆన్లైన్ పాఠాలు కొనసాగాయి.. ప్రస్తుతం పాఠశాలలు కళాశాలల్లో ఏప్రిల్ వరకు ప్రత్యేక తరగతులునిర్వహిస్తున్నారు.. ఈ లెక్కన చూసినా అయిదు నెలల ఆన్లైన్ మూడునెలల ఆఫ్ ల్తెన్ తరగతులకు మొత్తం ఏడాది ఫీజులు వసూలు చేస్తే అధికారం ఎక్కడిదని ప్రశ్నిస్తున్నారు.. తరగతులు నిర్వహించకపోయినా టీచర్లకు వేతనాలు చెల్లించకపోయినా పాఠశాలల నిర్వహణ ఖర్చు మిగిలినా ఫీజులు మాత్రం పూర్తిగా చెల్లించాలని ప్రైవేటు విద్యాసంస్థలు డిమాండ్ చేస్తుండటం పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు, తెలంగాణలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గత ఏడాది ఏప్రిల్-- 21న ప్రభుత్వం విడుదల చేసిన జీవో-- 46 సైతం అంతకుముందు పరిస్థితులను బట్టి జారీ చేసిందే.. అందులోనూ తదుపరి ఉత్తర్వులు ఇచ్చినా ఇంతవరకు కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలని పేర్కొన్నారు.. ప్రభుత్వం ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు కళాశాలలపై పెద్ద ఎత్తున ఫీజులు వస్తున్నాయి శాఖ నుంచి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని ప్రైవేటు విద్యా సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని అయిన అన్నారు.. ఈ కార్యక్రమంలో పేరు స్వామి, గణేష్, వెంకట్, మూలాలి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు..
Share this on your social network: