రవిందర్ స్వచ్చంద సేవాసంస్థ ఛైర్మన్ను ఘనంగా సన్మానించిన ఇంద్రజాలికులు
Published: Thursday February 25, 2021
గొల్లపల్లి ,పిబ్రవరి 24 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని చిల్వకోడూర్ గ్రామంలో రవీందర్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ సౌజన్యంతో నిర్వహించిన మూఢనమ్మకాలపై అవగాహన సదస్సు నిర్వహించిన రవీందర్ స్వచ్ఛంద సేవ సంస్థ చైర్మన్ నరసాపురం రవీంద్రను, ఇంద్రజాలికులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖకు చెందిన డి.ఎస్.పి వెంకటరమణ, సిఐ రామచంద్ర రావు, గొల్లపెల్లి ఎస్ఐ జీవన్, ధర్మపురి ఎస్ ఐ కిరణ్ కుమార్, తో పాటు ఎంపీపీ నక్కశంకర్, జడ్పిటిసి జలంధర్,ఏ ఎమ్ సి చైర్మన్ ముస్కు లింగారెడ్డి, గొల్ల పల్లి సింగిల్విండో చైర్మన్ రాజు సుమన్ రావు, సింగిల్విండో చైర్మన్ గందే వెంకట మాధవరావు, చిల్వకోడూర్ సర్పంచ్ పద్మ రవీందర్, గొల్లపల్లి సర్పంచ్ ముస్కు నిశాంత్ రెడ్డి, సంస్థ కార్యదర్శి భోధనపు శ్రీనివాస్, కనుకుంట్ల మహిపాల్ రెడ్డి, అంకం భూమయ్య, సజ్జనపు అశోక్, సజ్జనపు జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ మూఢ నమ్మకాల పై అవగాహన సదస్సు కు హాజరైన పోలీస్ శాఖ సిబ్బంది రాజకీయ నాయకులకు ప్రజలకు తోటి మిత్రులందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేశారు.
Share this on your social network: