కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్
Published: Tuesday December 28, 2021
వెల్గటూర్, డిసెంబర్ 27 (ప్రజపాలన ప్రతినిధి) : తెలంగాణ పి.సి.సి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు వెల్గటూర్ మండల కాంగ్రెస్ నాయకులు ఎర్రవల్లి లో రైతులతో రచ్చబండ కార్యక్రమం నకు మండల కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లకుండా మండల పోలీస్ అధికారులు అడ్డుకొని సోమవారం నాయకులను ముందస్తు అరెస్టు చేసిన వెల్గటూర్ ఎస్.ఐ నరేష్ అనంతరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అరెస్టయినవారిలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాటిపర్తి శైలేందర్ రెడ్డి,సర్పంచ్ మురళి గౌడ్, సందీప్ రెడ్డి, గండ్ర శ్రీకాంత్ రావు, సహకార సంఘం మాజీ ఉపాధ్యక్షులు గొల్ల తిరుపతి, పోలోజు శ్రీనివాస్, జితేందర్, మెరుగు నరేష్ గౌడ్, ఉదయ్ గౌడ్, గుమ్ముల వెంకటేష్, గాజుల లక్ష్మణ్, నరేష్ దావుల శశి నాయకులను అరెస్టయినవారిలో ఉన్నారు.
Share this on your social network: