జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీల్లో బంగారు పతకాలు సాధించిన మధిర సిమ్మర్స్
Published: Monday August 29, 2022
మధిర రూరల్ ఆగస్ట్ 28 ప్రజాపాలన ప్రతినిధి నేషనల్ స్పోర్ట్స్ డే సందర్భంగా ఆదివారం ఖమ్మం సర్దార్ పటేల్ స్విమ్మింగ్ పూల్ లో నిర్వహించిన సిమ్మర్స్ పోటీలలో మధిర సిమ్మర్స్ పలు పతకాలను సాధించారు. పతకాలను సాధించిన సిమ్మర్స్ ను ఆదివారం మధిర అసోసియేషన్ అధ్యక్షులు జంగా నరసింహారెడ్డి ప్రధాన కార్యదర్శి ఆవుల సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోటీల్లో తొమ్మిది మంది చిన్నారులు పాల్గొని మూడు బంగారు పథకాలు, నాలుగు రజిత మూడు కాంస్య పతకాలు సాధించినట్లు వారు తెలిపారు. మొత్తంగా 10 పతకాలు సాధించి మధిర సిమ్మర్స్ మొక్క సత్తాని చాటారని వారు తెలిపారు. పతకాలు సాధించిన జూనియర్ స్విమ్మర్స్ లో
మందరపు మనోజ్
50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో బంగారు పథకాన్ని, వంద మీటర్ల ఫ్రీ స్టైల్ వంద మీటర్ల బట్టర్ ప్లయి పోటీల్లో రజిత పథకాలను సాధించారు. అదేవిధంగా శ్రీరామోజు సాయి శరత్ చంద్ర వంద మీటర్ల బట్టర్ ఫ్లై పోటీలో బంగారు పతకాన్ని, వంద మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో రజిత పథకాన్ని సాధించినట్లు వారు తెలిపారు. ఆవుల శాన్వి 50 మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీల్లో రజిత పతకం వంద మీటర్ల ఫ్రీ స్టైల్ పోటీల్లో రజిత పతకాన్ని, 100 మీటర్ల బట్టర్ ఫ్లై పోటీల్లో కాంస్యం పతకాలు సాధించినట్లు వారు తెలిపారు. బొడ్డుపల్లి ప్రియాంషు యాభై మీటర్ల బ్యాక్ స్ట్రోక్ పోటీలో బంగారు పతకాన్ని బొడ్డుపల్లి శ్రీభద్ర యాబై మీటర్ల బ్యాక్ స్ట్రోక్ రజిత పతకాలు సాధించినట్లు వారు తెలిపారు. పతకాలు సాధించిన సిమ్మర్స్ ను మధిర సిమ్మర్స్ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు
Share this on your social network: