వికారాబాద్ జిల్లా మెపా మెపా కమిటీ ఎంపిక

Published: Friday March 03, 2023
వికారాబాద్ బ్యూరో 02 మార్చి ప్రజాపాలన :  ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్రం ( ఎంఇపిఏ ) యూనియన్ వికారాబాద్ జిల్లా నూతన కమిటీని పరిగి  మెపా కార్యాలయంలో   మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.సంజీవన్ కుమార్ ముదిరాజ్ నేతృత్వంలో నూతన కమిటినీ ఏకగ్రీవంగా ఎంపిక చేస్తూ.. కమిటీ సభ్యులకు నియామక పత్రాలు అందేసినట్లు మెపా రాష్ట్ర అధ్యక్షులు డా కొత్త గట్టు శ్రీనివాస్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ముదిరాజ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా అధ్యక్షులుగా శేరి రామాంజనేయులు  ముదిరాజ్, ప్రధాన కార్యదర్శిగా దుద్యాల వెంకటయ్య ముదిరాజ్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేసి వారికి నియామక పత్రాలను  అందజేశారు.

అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ..జిల్లాలో ముదిరాజ్ ల అభివృద్ది కోసం, రిజర్వేషన్ సాధన కోసం రాజకీయాలకు అతీతంగా పని చేస్తామని, మెపా కి అన్ని మండలాల్లో కమిటీలు వేసి, విద్య ఉద్యోగ సాధికారత కోసం పని చేస్తామని అన్నారు.ఈ ఎన్నికకు సహకరించిన రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు,రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవన్ కుమార్ గారికి,  వికారాబాద్ జిల్లా  మెపా ఉద్యోగులకు వివిధ జిల్లాల కమిటీ సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మెపా  రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు ఎస్. వెంకటయ్య, ఎస్.మొగులయ్య, జీ.కిష్టయ్య,ఎస్. విజయ కుమార్, కే.శ్రీశైలం, డి.వెంకటయ్య,గుడాల వెంకటయ్య.కే.రామకృష్ణ దనేశ్వర్, అర్.సుభాష్ రెవెన్యూ ఉద్యోగులు,యు.రాజు. బి.రామస్వామి తదితర ముదిరాజ్  పెద్దలు  పాల్గొన్నారు.