తెలంగాణ రథసారథి బండి సంజయ్ కు మహిమాన్విత లడ్డు ను బహుమానంగా అందజేసిన నీలా రవి నాయక్

Published: Friday September 24, 2021
బాలాపూర్: సెప్టెంబర్ 23, ప్రజాపాలన ప్రతినిధి : బిజెపి తెలంగాణ అధ్యక్షుల తో పాటు పలువురు ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొన్న ఆ యాత్రకు  ఇలాంటి అడ్డంకులు కలుగకుండా విజయవంతంగా కొనసాగాలని మీర్ పేట్  కార్పొరేషన్ రత్లవత్  నీలా రవి నాయక్ పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనీ చింతలకుంటలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఉత్సవ కమిటీ విగ్నేశ్వరుని భక్తిశ్రద్ధలతో పూజలు అందుకున్న మహిమాన్విత లడ్డును వేలం పాటలో 1.25 లక్షలకు కైవసం చేసుకున్న రత్లావత్ బ్రదర్స్. కార్పొరేటర్ నీలా రవి నాయక్ గణేశుని లడ్డు ప్రసాదాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ కు  కానుకగా గురువారం ఉదయం 11 గంటలకు  అందజేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ నీల రవి నాయక్ మాట్లాడుతూ..... బిజెపి తెలంగాణ రాష్ట్ర రథసారథి బండి సంజయ్ కుమార్ తో కలసి పలువురు బీజేపీ నేతలు  ప్రజా సంగ్రామ యాత్రలో చేస్తున్నటువంటి పాదయాత్ర కు ఎలాంటి  అడ్డంకులు కలగకుండా విజయవంతంగా కొనసాగాలని కోరుకుంటూ, ఆ దేవదేవుని ప్రసాదాన్ని బహుమానంగా స్వీకరించగలరని కోరారు. బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ..... ఆ దేవ దేవుని ప్రసాదం అందించిన బిజెపి శ్రేణులలో నీలా రవి నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి ఒక్కరు బీజేపీ బలోపేతానికి కృషి చేయాలని కోరుతూ యాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనిత నాయక్, కార్పొరేటర్ మోడల బాలకృష్ణ, కార్పొరేషన్ ప్రధాన కార్యదర్శి గాజుల మధు, ఎస్టీ సెల్ వైస్ ప్రెసిడెంట్ బాలునాయక్, శివ, ప్రశాంత్ నాయక్, తదితరులు బిజెపి కార్యకర్తలు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.