రోడ్డును మరమ్మతు చెయాలి

Published: Friday October 08, 2021
బోనకల్, అక్టోబర్ 7, ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని ఆళ్లపాడు నుండి రావినూతల వైపు వెళ్లే రోడ్డును వేంటనే మరమత్తులు చేయాలని రైల్వే గేట్ మూసివేసి నందున రావినూతల వైపు రహదారి రోడ్డు మొత్తం గుంటలు ముళ్ల కంపతో రాకపోకలకు ఇబ్బంది ఉన్నందున అధికారులు స్పందించి వెంటనే గుంతలను ముళ్ల కంచెను తొలగించాలని, బైక్ లు కారులు వేళ్ళే పరిస్థితి లేదు కనుక కారులు రావేది కాక ఆళ్లపాడు కు కలకోట వైపు నుంచి 20 కిలొ మీటర్లు దూరం నుంచి రావటం జరుగుతుంది. రావినూతల రోడ్డు రిపేర్ చేస్తే 8కిలొ మీటర్లు దూరంతో రావచ్చును. ఇప్పుడు ఉన్నా ప్రేట్రోలు డిజిల్ దరలు ఆకాశాన్ని అంటు తున్నాయి ప్రయాణం చేయాలంటే  ఏక్కడ ఏమి ఇరిగి పోతాయౌ అని ప్రయాణీకులు భయాందోళనలు చేందుతున్నారు. వేంటనే రొడ్డు పక్కన ఉన్నా ముళ్ల కంప ను గుంటలు పూడ్చాలనీ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ మరియు గ్రామ ప్రజలు కోరుతున్నారు.