అరికట్టాలి : మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు మల్లేశ్వరి

Published: Tuesday August 10, 2021
మధిర, ఆగష్టు 09, ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపాలిటీరాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచార మరియు లైంగిక దాడులను కఠినమైన చర్యలతో ప్రభుత్వం ఆరి కట్టాలని సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వైరా మండలం ఉప్పల మడక ఎం పి టి సి బురుగు సంజీవ రావు లింగన్న పాలెం గ్రామంలో మైనర్ బాలికపై లైంగికంగా అత్యాచారయత్నానికి పాల్పడిన విషయంపై ఖమ్మం జిల్లా బిజెపి మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కుంచం మల్లేశ్వరి తీవ్రంగా ఖండిస్తూ. ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు అతనిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసి కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితురాలు కు వైద్యం విద్య అదేవిధంగా 20 లక్షల నగదు 3 ఎకరాల పొలము ప్రభుత్వం కల్పించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం వారికి ఎటువంటి ఇబ్బందులు ఒత్తిడులు లేకుండా రక్షణ కల్పించాలని కుంచం మల్లేశ్వరి ఒక ప్రకటనలో కోరారు ఆ బాలికకు న్యాయం జరిగే వరకు ఖమ్మం జిల్లా బిజెపి అధ్యక్షులు గల్లా సత్యనారాయణ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో వారికి అండగా ఉంటుందని తెలిపారు ఈ సమావేశంలో మధిర పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు తుళ్లూ రి యామిని పాల్గొన్నారు