సిఎం మానస పుత్రిక పట్టణ ప్రగతి

Published: Saturday July 03, 2021
మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్
వికారాబాద్ జూలై 02 ప్రజాపాలన బ్యూరో : పట్టణ ప్రగతి లక్ష్యంగా కృషి చేస్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ పరిధిలోని గంగారం గ్రామంలోని వైకుంఠధామం ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు ఇంటి వద్ద మొక్కలు నాటి పట్టణాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైస్ ఛైర్ పర్సన్ శంషాద్ బేగమ్, స్థానిక కౌన్సిలర్లు సురేష్, ఆలూరి రాజ్యలక్ష్మి రమణ, మున్సిపల్ మాజీ వైస్ ఛైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, కమిషనర్ బుచ్చయ్య, ఏఈ రాయుడు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, హరితహారం ఇన్వాల్మెటరి ఇంజనీర్ శ్రీను తదితరులు తల ఒక మొక్కను నాటడం జరిగింది.