సాటి మనిషికి అండగా ఉందాం.... శివారెడ్డి

Published: Saturday July 03, 2021
బాలాపూర్, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : కరోనాను జయిదాం.... సాటి మనిషి కి అండగా ఉందామని బిజెపి 5వ డివిజన్ కంటెస్టెంట్ కార్పొరేటర్ శివారెడ్డి ఆన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఉన్నటువంటి ఐదో డివిజన్లోని వినాయక్ హిల్స్ లో కరోనా వచ్చి కోలుకున్న కుటుంబాలకు అండగా ఉండాలని బిజెపి కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ఆదేశాల మేరకు ఈ మధ్య కాలంలో కరోనా వచ్చి భర్త కోల్పోయిన సునీల్ కుటుంబానికి స్థానిక కంటెస్టెంట్ కార్పొరేటర్ శివారెడ్డి 25 కిలోల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...... సాటి మనిషికి అండగా ఉందాం... కరోనా ను జైయిందాం.... ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఉన్న వాళ్ళు తమకు తోచిన విధంగా ఎంతో కొంత సాయం చేయాలని, కరోనా బాధితులైన్ కనీసం రెండు కుటుంబాలకు ఆకలి తీర్చగలరని తమ కర్తవ్యంగా భావించాలిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకున్న వారే నిజమైన నాయకులని బాధితులు ధన్యవాదాలతో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు రామ్ రెడ్డి, మాడుగుల యాదగిరి, శ్రీనివాస్ రెడ్డి, ఆంజనేయులు, వెంకటేష్ నాయక్, శివ శంకర్, తదితరులు పాల్గొన్నారు.