అవధుల్లేని అబిమాను‌తో జన్మదిన వేడుకలు

Published: Thursday July 07, 2022

వికారాబాద్ బ్యూరో జూలై 06 ప్రజాపాలన : అభిమానులు నా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం పూర్వజన్మ సుకృతమని ధారూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు  రఘువీరా రెడ్డి తీపి జ్ఞాపకంగా హృదిలో పదిలంగా దాచుకున్నారు. బుధవారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గంగారం సమీపంలో రఘువీరారెడ్డి వేడుక వేదికలో జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుండి భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు, అభిమానులు, నాయకుల మధ్య జరుపుకున్నారు, హైదరాబాద్ లో మాజీమంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ ఆశీస్సులు తీసుకొని స్వగ్రామమైన అంతారాంలో మహిళలు, వృద్ధులు, యువకులు, కార్యకర్తలు మేళతాలాలతో ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తన అనుచరులు నిర్వహించిన వేడుకల్లో వికారాబాద్ జిల్లా నలుమూలల నుండి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజల సమక్షంలో కేకు కట్ చేసి, బాణా సంచలు కాలుస్తూ జన్మదిన వేడుకలను  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు సతీష్ రెడ్డి, వికారాబాద్, మర్పల్లి బషీరాబాద్ మండలాల పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, రవీందర్, శంకరప్ప, వికారాబాద్ కో ఆప్షన్ మెంబర్ ఎర్రవల్లి జాఫర్, మాజీ కౌన్సిలర్ క్రిష్ణా రెడ్డి, సీనియర్ నాయకులు బుజ్జయ్య గౌడ్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి రఘువీరా రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.