పారిశుద్ధ్య సిబ్బందికి మాస్కులు గ్లౌజులు పంపిణీ

Published: Thursday May 27, 2021
మేడిపల్లి, మే26 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి రెండో దశలో విజృంభిస్తున్న నేపథ్యంలో ఉప్పల్ డివిజన్లోని లక్ష్మీ నారాయణకాలనీలో పారిశుద్ధ్య కార్మికులకు స్థానిక కార్పొరేటర్ మందుముళ్ళ రజితపరమేశ్వర్ రెడ్డి మాస్కులు, గ్లౌజులను పంపిణీ చేశారు. డివిజన్లోని మిగతా కార్మికులకు సైతం ఇదే తరహాలో పంపిణీ చేయనున్నట్టుగా కార్పొరేటర్ తెలిపారు. కరోనా విపత్తులో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలు మరువలేనివని కార్పొరేటర్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు లూకాస్, బొడ్డు రవీందర్, గోపాల్, అశోక్ గౌడ్, వెంకట్ రెడ్డి, మీసాల రాములు, సురేందర్ రెడ్డి, సత్యనారాయణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు.