సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయండి

Published: Friday November 18, 2022
బెల్లంపల్లి నవంబర్ 17 ప్రజా పాలన ప్రతినిధి:  బెల్లంపల్లి ఏరియా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఎస్ సి కేఎస్ (సి.ఐ.టి.యు) 6వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని  సిఐటియు జిల్లా నాయకులు వెలిశాల కృష్ణమాచారి విజ్ఞప్తి చేశారు.
గురువారం నాడు బెల్లంపల్లి ఏరియాలోని కూడా ఓసీపీలో మహాసభల గోడ ప్రతులను ఆయన విడుదల చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియా సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం ఆరవ రాష్ట్ర మహాసభలను నవంబర్ 26, 27 తేదీలలో శ్రీరాంపూర్, మంచిర్యాలలో, జరుప తలపెట్టామని కాంట్రాక్టు కార్మికులందరూ అధిక సంఖ్యలో హాజరై సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
 ఈ కార్యక్రమములో డ్రైవర్ల సంఘం నాయకులు శ్రీనివాస్,  సివిల్ డిపార్ట్మెంట్ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.