ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి

Published: Tuesday March 07, 2023
*  జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 మార్చి ప్రజాపాలన :  ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి  అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన  322  దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని అన్నారు. ఈ సందర్బంగా  కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులను వెంటనే సంబంధిత శాఖలు  పరిష్కారించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం అన్ని మండల కేంద్రాలలోని తహసిల్దార్ కార్యాలయాలలో అలాగే మున్సిపల్ కార్యాలయాలలో కూడా ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలియజేశారు.  ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, అసిస్టెంట్ ట్రేయిని  కలెక్టర్ సంచిత్ గంగ్వార్, జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ కుమార్ వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గోన్నారు.