గిరిజన బాలుర పాఠశాలలో ఇగ్గనైట్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు*

Published: Thursday December 01, 2022

ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 29 ప్రజాపాలన ప్రతినిధి 

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం తెలంగాణ ప్రభుత్వ గిరిజన బాలుర పాఠశాలలో ఇగ్నైట్ పేస్ట్ రీజనల్ కార్యక్రమాన్నినిర్వహించడం జరిగింది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి పాఠశాల విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రీజనల్ కోఆర్డినేటర్ పి ఎస్.కళ్యాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు నళిని మోహన్ మాట్లాడుతూ రెండు రోజుల ఈ కార్యక్రమంలో మొదటిరోజుగా సైన్స్ ఫెయిర్, వ్యాసరచన పోటీలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల యందు యూత్ పార్లమెంట్, పాటల పోటీలు తదితర అంశాలపై విద్యార్థులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ప్రభాకర్, బ్రహ్మచారి, మహేంద్ర, లక్ష్మీ ప్రసన్న, కవిత, స్వరూప, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.