శివారెడ్డి పెట్ పరీక్షా కేంద్రం పరిశీలన

Published: Tuesday April 04, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన : 
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా శివారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సోమవారం సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు ఇతర సదుపాయాలపై అదకారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.  రవాణా సౌకర్యంపై , సదుపాయాలపై కలెక్టర్  ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పై కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులు సూచించారు. కలెక్టర్ తో పాటు  జిల్లా  విద్యాశాఖ అధికారి రేణుకాదేవి ఉన్నారు.