శివారెడ్డి పెట్ పరీక్షా కేంద్రం పరిశీలన
Published: Tuesday April 04, 2023
* వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి
వికారాబాద్ బ్యూరో 3 ఏప్రిల్ ప్రజా పాలన :
పదవ తరగతి పరీక్షలు జరుగుతున్న సందర్భంగా శివారెడ్డిపేట ప్రభుత్వ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి సోమవారం సందర్శించారు. పరీక్ష కేంద్రాల్లో త్రాగునీరు ఇతర సదుపాయాలపై అదకారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రవాణా సౌకర్యంపై , సదుపాయాలపై కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పై కలెక్టర్ ఆరా తీశారు. పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని అధికారులు సూచించారు. కలెక్టర్ తో పాటు జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి ఉన్నారు.
Share this on your social network: