మండలంలో పలు సమస్యలపై సీఎల్పీ నేతను కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు

Published: Saturday November 19, 2022

బోనకల్, నవంబర్ 18 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో పలు సమస్యలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ను ఖమ్మం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మండలానికి చెందిన నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు మండలంలో గల పలు సమస్యలను ఆయనకు విన్నవించారు.ఆయా సమస్యలను క్షుణ్ణంగా విన్న భట్టి త్వరలోనే మండలంలో పర్యటిస్తానని వారికీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీ కార్యదర్శి బంధం నాగేశ్వరావు, మధిర మార్కెట్ కమిటీ మాజీచైర్మన్ వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గోవిందాపురం(ఏ) గ్రామ సర్పంచ్ భాగం శ్రీనివాసరావు,మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉమ్మీనేని రమేష్,మండల బీసీ సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు, షేక్ బడే,యువజన నాయకులూ హేమోను,బుడుగు జంగాల మండల అధ్యక్షుడు శ్రీ పాటి నాగరాజు, కొండ అవినాష్ ,తదితరులు పాల్గొన్నారు.