మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే ఏర్పాటు చేయాలి

Published: Friday June 25, 2021

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్
బెల్లంపల్లి, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాలను బెల్లంపల్లి లోనే నిర్మించి దళిత గిరిజన మరియు పేద వర్గాలకు వైద్యం అందించాలని తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం, (ఏఐటీయూసీ) బెల్లంపల్లి ఏరియా కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది, గురువారం నాడు స్థానిక కాంటా చౌరస్తాలో భవన నిర్మాణ కార్మికులను కలసి మెడికల్ కళాశాల సాధన కోసం జరుగుతున్న ఉద్యమంలో పాల్గొని మన కర్తవ్యాన్ని నిర్వహించాలని కార్మికులను కోరారు, అనంతరం వారు గోడ ప్రతులను విడుదల చేశారు, ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు దాసరి బాణయ్య, ప్రధాన కార్యదర్శి ఎల్తూరి శంకర్, సంఘ సభ్యులు ఆవునూరిరాజు, చిప్పకుర్తిబాబు, అంజి, లింగంపల్లి రాయలింగు, పోషం, రామూర్తి, భవన నిర్మాణ కార్మికులు తదితరులు