మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన టీఆర్ఎస్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్
Published: Tuesday October 19, 2021
మేడిపల్లి, అక్టోబర్18 (ప్రజాపాలన ప్రతినిధి) : దసరా పండుగను పురస్కరించుకొని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రాల వెంకటేష్ యాదవ్ కార్మిక శాఖ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి మల్లారెడ్డిని శాలువాతో సత్కరించి దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి మల్లారెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన వారిలో 24వ డివిజన్ అధ్యక్షులు ముద్దం రామచందర్ యాదవ్, యూత్ తోట కృష్ణ, శ్రీశైలం యాదవ్, రాము యాదవ్, సాయి యాదవ్ ఉన్నారు.
Share this on your social network: