వీరశైవ లింగాయత్ రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల నాగరాజు
Published: Wednesday June 08, 2022
హైదరాబాద్ (ప్రజపాలన ప్రతినిధి ):
గత పది సంవత్సరాలుగా సూర్యాపేట జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విశేష సేవలు అందించిన సేవలను గుర్తించి సూర్యాపేట జిల్లాకు చెందిన బత్తుల నాగరాజు కు రాష్ట్ర కార్యదర్శితో పాటు మీడియా ఇంచర్జ్ గా బాధ్యతలు అప్పగించినట్లు లింగాయత్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ముస్తాపురే తెలిపారు. ఈ మేరకు మంగళవారం వీరశైవ లింగాయత్ లింగ బలిజ సమన్వయ సమితి రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో బత్తుల నాగరాజుకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తున్నమని రాష్ట్ర అధ్యక్షులు అశోక్ ముస్తాపురే, రాష్ట్ర ఉపాధ్యక్షులు బర్మని మల్లిఖార్జున్, ప్రధాన కార్యదర్శి సంకటాల సోమేశ్వర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర కమిటీకి కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పని చేస్తానని హామీ ఇచ్చారు.
Share this on your social network: