31వ వార్డులో ఉచిత వైద్య శిబిరం

Published: Thursday February 11, 2021

వార్డు కౌన్సిలర్ మాలె గాయత్రీ లక్ష్మణ్ 31వ వార్డులో మా శారద ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 10 ( ప్రజాపాలన ) : వార్డు ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని కౌన్సిలర్ మాలె గాయత్రీ లక్ష్మణ్ అన్నారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 31వ వార్డులో వార్డు కౌన్సిలర్ మాలె లక్ష్మణ్ ఆధ్వర్యంలో మా శారద ఆసుపత్రి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..వార్డులో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న ప్రతి ఒక్కరు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చైర్ పర్సన్ కోరారు. ఎప్పుడూ ప్రజల మధ్యే ఉంటూ, ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న కౌన్సిలర్ మాలె గాయత్రీ లక్ష్మణ్ దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, టీఆర్ఎస్ నేతలు లక్ష్మణ్, గిరీష్,  నాగయ్య,కిశోర్,ధనుంజయ చారీ,ఆఖిల్ గౌడ్,మాణిక్ ప్రభు,మరియు వార్డు ప్రజలు మా శారదా హాస్పిటల్ డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.