ఆ దేవ దేవుని కృపా ఎల్లవేళలా ఉండాలి: మేయర్

Published: Friday April 23, 2021

బాలపూర్, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : శ్రీ రామ నవమి పర్వదిన సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవలో పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ లోని బాలాపూర్ గ్రామంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో నిర్వహించిన సీతా రాముల వారి కల్యాణంలో కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి దంపతులు పాల్గొని, శ్రీరామ నవమి వేడుకలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం వేద పండితులు, మేయర్ మాట్లాడుతూ... గత సంవత్సరం నుండి ప్రజలను కరోనా మహమ్మారి వైరస్ చిక్కుల్లో చిక్కుకొని చింతిస్తున్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ, ఆ దేవదేవుని యావత్ తెలంగాణ ప్రజలందరూ ముఖ్యంగా కార్పొరేషన్ ప్రజలందరికీ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటూ, మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ,కరోనా మహమ్మారినీ తరిమికొడదాం. ఈ శ్రీ సీతా రాముల దేవుని కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో సామల ప్రవీణ్, ఆంజనేయ చారి, జి వెంకటేష్, శ్రీనివాస్ రెడ్డి, సి తిరుపతి రెడ్డి మరియు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.