జయశంకర్ సారు కు నివాళులర్పించిన జెడ్ పి టి సి నిత్య నిరంజన్ రెడ్డి

Published: Saturday August 07, 2021
ఇబ్రహీంపట్నం, ఆగస్టు 6, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహింపట్నం మంచాల మండల పరిధిలోని నిత్య నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ జయశంకర్ సార్ తెలంగాణ స్ఫూర్తి నందించిన సిద్ధాంతకర్త నాలుగు కోట్ల ప్రజల గొంతుకలో ఉద్యమ చైతన్యాన్ని నూరిపోసి రగిలించి తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి అందించిన  ప్రదాత ఆచార్య  కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా శుక్రవారం మంచాల మండల కార్యాలయం వద్ద జయంతి కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచాల మండలం జెడ్పీటీసీ మర్రి నిత్య నిరంజన్ రెడ్డి, ఈ కార్యక్రమంలో ఎంపీపీ నర్మద, ఎంపీటీసీలు ఎడ్మ నరేందర్ రెడ్డి, పల్నాటి జయ నందం, లట్టుపల్లి చంద్రశేఖర్ రెడ్డి, వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.