మార్చి 5న చిత్రలేఖన పోటీలు
Published: Wednesday March 01, 2023
మంచిర్యాల టౌన్, ఫిబ్రవరి 28, ప్రజాపాలన : జూనియర్ ఛాంబర్ ఇంటర్ నేషనల్ మంచిర్యాల వారి ఆధ్వర్యంలో మార్చి 5 వ తేదీన జిల్లా స్థాయి లో చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందని జె సి ఐ మంచిర్యాల ప్రెసిడెంట్ ఆరుముళ్ళ రాజు అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ విభాగాల్లో
1వ తరగతి నుండి 3 వ తరగతి విభాగం లో మై ఫెవరాటే కార్టూన్ క్యారెక్టర్ అనే అంశం, 4వ తరగతి నుండి 6 వ తరగతి విభాగము లో క్లీన్ ఇండియా సేవ్ ద ట్రీస్ అనే అంశం,7వ తరగతి నుండి 9వ తరగతి విభాగం లో సేవ్ ద నేచర్, ఎలక్ట్రిసిటీ అనే అంశాలలో పిల్లలకు జిల్లా స్థాయిలో పోటీలు నస్పూర్ లోని శ్రీరామచంద్ర మిషన్ మనోరంజన్ సముదాయ్
సి.ఈ.ర్ క్లబ్ ఎదురుగా ఉంటుందని అన్నారు.వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్స్ జె సి వెంకటేష్ ప్రాజెక్ట్ చైర్మెన్ 9676036829, 9985512134. ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
Share this on your social network: