టీపీసీసీ చీఫ్ ఎంపీ రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన పరమేశ్వర్ రెడ్డి

Published: Monday June 28, 2021
మేడిపల్లి, జూన్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ చీఫ్ గా ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం పట్ల ఉప్పల్ సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ కార్పొరేటర్ మందుముల పరమేశ్వర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు పరమేశ్వర్ రెడ్డి ఆదివారం తన అనుచరులు, ఉప్పల్ సర్కిల్ కాంగ్రెస్ నాయకులతో కలిసి రేవంత్ రెడ్డి ఇంటి వద్ద ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి, రాఘవేందర్ గుప్తా, పూజారి హనుమంతు, పాలడుగు లక్ష్మణ్, జిత్తు రెడ్డి, బంటి, కన్నమైన నరేష్ తదితరులు పాల్గొన్నారు.