ఏఎన్ఎం కోర్సులకు మహిళల నుండి దరఖాస్తులు కోరుతున్న తెలంగాణ ప్రభుత్వం.... భద్రాచలం ఐటిడిఎపిఓ గ

Published: Friday December 23, 2022

  మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఎం పి హెచ్ డబ్ల్యు (మహిళలు) శిక్షణా కేంద్రం టేకులపల్లి, ఖమ్మం జిల్లాలో ఎం పి హెచ్ డబ్ల్యు (ఎఫ్) /ఏఎన్ఎం కోర్సుల ప్రవేశం కొరకు ఆసక్తి కలిగిన ఉమ్మడి ఖమ్మం జిల్లా గిరిజన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు కమిషనర్, గిరిజన సంక్షేమ శాఖ, హైదరాబాదు వారు తెలియజేసినందున ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు ఒక ప్రకటనలో తెలిపారు. ఎం పి హెచ్ డబ్ల్యు( ఎఫ్ )ఏఎన్ఎం కోర్సుకు దరఖాస్తు చేయుటకు ఇంటర్మీడియట్ ఏదైనా గ్రూపు నందు పూర్తిచేసి ఈనెల 31 నాటికి 17 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలని మరియు దరఖాస్తును డిసెంబర్ 31 నాటికి. నందు నేరుగా సమర్పించాలని ఆయన తెలిపారు.