*అంబేద్కర్ గారి విగ్రహాన్ని తొలగిస్తే ఊరుకోం* -అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక

Published: Wednesday February 01, 2023

చేవెళ్ల జనవరి 31,(ప్రజాపాలన):-

రంగారెడ్డి జిల్లా,షాద్నగర్ చౌరస్తాలోని బస్టాండ్ పక్కన గల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహా న్ని రోడ్డు విస్తరణ పేరుతో తొలగించుటకు కుట్రలు చేస్తే ఊరుకునేది లేదని  అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు  మైలారం సుబ్రహ్మణ్యం హెచ్చరించారు.  మాట్లాడుతూ నవభారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేయడం సరైంది కాదని అన్నారు. ఈ దేశంలోని ఆర్థిక,సామాజిక సమానత్వ కోసం నిరంతరం కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ గారు అని అన్నారు. అంబేద్కర్ గారి విగ్రహాలని తొలగించాలని ప్రయత్నిస్తే అంబేద్కర్ ప్రజా సంఘం   ఆధ్వర్యంలో ఆందోళనలను  చేపడతామనిఅన్నారు.