ప్రజాబంధు పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక

Published: Friday July 09, 2021

మంచిర్యాల టౌన్, జూలై08, ప్రజాపాలన : ఇండియా ప్రజాబందు పార్టీ మంచిర్యాల జిల్లా అద్యక్షులు గా రామడుగు రాజుజాన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర నాయకులు గురువారం ఒక పత్రికా ప్రకటనలో తెలియజేశారు. ఈ సందర్భంగా నూతనంగా ఎంపికైన జిల్లా అధ్యక్షుడు రాజుజాన్ మాట్లాడుతూళ మంచిర్యాల జిల్లా ప్రజాబంధు పార్టీ కార్యవర్గ సభ్యుల సమావేశం హైదరాబాద్ లో గురువారం రోజున జరిగిందని, ఈ సమావేశం లో నూతన కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపారు. తనను జిల్లా అద్యక్షులుగా నియమించిన ఇండియా ప్రజాబంధు పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడైన డా. రంజీత్,  రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల అరుణ్ కుమార్ గార్లకు అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజ్ ప్రకాష్ , మంచిర్యాల జిల్లా పార్టీ కమీటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు బాధ్యతల అప్పగించినందున శక్తివంచన లేకుండా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా పార్టీ యొక్క కార్యక్రమాలను నిర్వహిస్తూ జిల్లాలో పార్టీని బలోపేతం చేసే దిశగా నడుస్తానని తెలిపారు.