విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు

Published: Friday January 13, 2023
జనవరి 12 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విద్యుత్ శాఖ మధిర సబ్ డివిజన్ ఆఫీసు నందు అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ శ్రీమతి ఎం. అనురాధ  ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద వారి ఆశయాలకు అనుగుణంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర పట్టణ మరియు గ్రామీణ అసిస్టెంట్ ఇంజనీర్స్ నాగేశ్వరరావు అనిల్ కుమార్  అదే విధంగా రెవెన్యూ శాఖ అసిస్టెంట్ అకౌంట్ ఆఫీసర్ ప్రభాకర్ , జేఏవోలు రాజేశ్వరి, రవి వర్మ, సీనియర్ అసిస్టెంట్ రమేష్  శ్రీధర్, రోజా మని, కుమారి, లక్ష్మి, కృష్ణకుమారి తదితర విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొని స్వామి వివేకానందుల వారికి ఘనమైన నివాళులర్పించారు.