అత్యాచారం చేసిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి : బీజేపీ
Published: Saturday May 29, 2021
జగిత్యాల, మే 28, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల జిల్లా బీజేపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండ పోయిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బిజెపి నాయకులు విరుచుకుపడ్డారు. రాయికల్ మండలంలో అత్యాచారానికి గురైన నిరుపేద మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం గర్భవతిని చేసి తప్పించుకు తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసి కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి భూమి రమణ కుమార్ డిమాండ్ చేశారు. బాలిక కుటుంబ ఆర్థిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని కోరికలు తీర్చుకోని బాలికను గర్భవతిని చేసిన కూడ జిల్లాలో మహిళలు ఉన్నతమైన పదవుల్లో ఉండి కూడ తోటి మహిళకు అన్యాయం జరిగిన కూడ పట్టించుకోకుండ ఉంటున్నారంటే మహిళా వ్యవస్థ ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చని రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఠాకూర్ పవన్ సింగ్ గోలి మాల్లారెడ్డి కోలడి కొండల్ రావు ఠాకూర్ తిరుపతి సింగ్ పాల్గొన్నారు.
Share this on your social network: