కరోనాను అరికట్టేందుకు ప్రజలు సహకరించాలి: కార్పొరేటర్ చేతన హరీష్
Published: Wednesday May 12, 2021
మేడిపల్లి, మే11, (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ప్రజలు సహకరించాలని హబ్సిగూడ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరీష్ కోరారు. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ ముందస్తు చర్యల్లో భాగంగా కార్పొరేటర్ చేతన హరీష్ డివిజన్లోని వెంకట్ రెడ్డి నగర్, వాసవినగర్లలో సోడియం హైపోక్లోరైట్ ద్రావాణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ, నిబంధనలను పాటిస్తూ, ప్రజలందరూ కరోనా పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి చెల్లోజు ఎల్లాచారి, సీనియర్ నాయకులు రాగి వెంకట్ రెడ్డి, పారుపల్లి హనుమంతారావు, దారం వెంకటేశ్ గుప్తా, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా, రఘు గౌడ్, శివగౌడ్, రాంమచద్రం తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: