సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నాం

Published: Friday October 28, 2022
బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద రెడ్డి
వికారాబాద్ బ్యూరో 27 అక్టోబర్ ప్రజాపాలన : కెసిఆర్ ఫార్మ్ హౌస్ కుట్రను తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద రెడ్డి విమర్శించారు. మునుగోడు ఉప ఎన్నికలో తెరాస ఓడిపోతుందనే భయంతో సీఎం కెసిఆర్ ఫామ్ హౌస్ లో దొంగ డ్రామాను రక్తికట్టించారని దెప్పిపొడిచారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో బిజెపి పట్టణ అధ్యక్షుడు తూర్పు రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన తెలుపుతూ సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కు బిజెపి ఫోబియా పట్టుకుందన్నారు.  ఫామ్ హౌస్ లో చిల్లర గాళ్ళతో తెరాస ఎమ్మెల్యేలను బిజెపి కొనుగోలు చేసిందని హై డ్రామా క్రియేట్ చేశారని ఘాటుగా స్పందించారు. బిజెపిపై బురదజల్లే కార్యక్రమాలు మానుకోవాలని హితవు పలికారు. దమ్ముంటే ధైర్యం ఉంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలు గురించి ప్రచారం చేసుకొని ప్రజాక్షేత్రంలో గెలవాలని సూచించారు. లేనిపోని అభాండాలు బిజెపి పై రుద్దడానికి ప్రయత్నం చేసి సిఎం కెసిఆర్ బొక్క బోర్ల పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు.  కెసిఆర్, కెటిఆర్ లు ఇంతగా దిగజారుడు పనులకు అనుకుంటారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కు అధికార పీఠం ఎక్కడ జారుతుందోనని వెన్నులో వణుకు పుడుతుందని తీవ్రంగా విమర్శించారు. తెరాస నిరంకుశ పాలనను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు. ఇంతలా అధర్మం చేస్తున్న కల్వకుంట్ల కుటుంబాన్ని ఇంటికి సాగనంపాలి అని వికారాబాద్ జిల్లా అధ్యక్షులు సదానందరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు . ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు రాఘవన్ నాయక్ టౌన్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మండల అధ్యక్షులు గోపాల్ రెడ్డి దళిత మోర్చా అధ్యక్షులు నవీన్ ప్యాట శంకర్ నరోత్తం రెడ్డి కౌన్సిలర్ తొడిగల శ్రీదేవి శ్రీకాంత్ రెడ్డి శివప్రసాద్ ధరమ్ సింగ్ సాయి కృష్ణ ముదిరాజ్ రఘు యాదవ్ యాస్కి శిరీష సుచరిత గొడుగు సుధాకర్ రమేష్ వెంకట్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.