10వ డివిజన్ లో జాతీయ జెండా ఆవిష్కరణ

Published: Friday June 04, 2021
బాలపూర్, జూన్ 03, ప్రజాపాలన ప్రతినిధి : పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ సిబ్బందిలు వీధి వీధి కి చేస్తున్న సేవలు లెక్కలేనంతని బొద్ర మోనీ రోహిణి రమేష్ ముదిరాజ్ పేర్కొన్నారు. బడంగ్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వివిధ కాలనీలో పరిసరాల పరిశుభ్రత పరిరక్షణ కోసం ఎల్లప్పుడు సంపూర్ణంగా పారిశుద్ధ కార్మికులు, శానిటేషన్ సిబ్బంది చేస్తున్న సేవలు లెక్కలేనంతని కరోనా మహమ్మారి జాగ్రత్తలు పాటిస్తూ జీవనము గడుపుతూ వివిధ కాలనీలో పరిశుభ్రత గా ఉంచుతున్నారు అంటే వారికి సెల్యూట్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు మాజీ గ్రామ సర్పంచి, నగర దీపికలు, పారిశుద్ధ్య కార్మికులు, శానిటేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.