పిల్లలకు అందించే విద్యపైనే దేశ భవిష్యత్తు : మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

Published: Thursday July 28, 2022

శేరిలింగంపల్లి -ప్రజాపాలన/జూలై 27 : పిల్లలకు అందించే విద్యపైనే పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, విద్యార్థులు కష్టపడినప్పుడే జ్ఞానార్జన సాధ్యమవుతుందని బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి పేర్కొన్నారు. బుధవారం శేరిలింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో ఉన్న వేమన డబ్ల్యూ ఎస్ సి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులకు బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉచిత నోట్ బుక్స్, పేన్సిల్స్, పెన్నులు, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు అలాగే అంగన్వాడీ విద్యార్థులకు పలకలు, నోట్ బుక్స్ మొదలగు వస్తువులను బొబ్బ చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్ బొబ్బ నవత రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా నవత రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్య పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో, పేద విద్యార్థుల సంక్షేమం కోసం వారు చదువుకోవాలనే ఆకాంక్షతో గత 13 సంవత్సరాలుగా విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు, పెన్సిల్స్, రబ్బర్లు, షర్పనర్లు, స్కేళ్ళు, పలకలు మొదలు వస్తువులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో చందర్ రావు, షైఫుల్లహ ఖాన్, గౌస్, పోచయ్య, అనంత రెడ్డి, శోభ దుబే, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.