రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలి,

Published: Saturday May 29, 2021

అప్ప పెళ్లి లో కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎంపీపీ అరిగెల మల్లికార్జున్

ఆసిఫాబాద్ జిల్లా, మే27 (ప్రజాపాలన, ప్రతినిధి) : రైతులకు ఇబ్బందులు కలగకుండా వరి ధాన్యం కొనుగోలు చేపట్టాలని ఎంపీపీ అరిగెల మల్లికార్జున్ అన్నారు. గురువారం మండలంలోని అప్ప పెళ్లి గ్రామంలో సొసైటీ ఆధ్వర్యంలో చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మల్లికార్జున మాట్లాడుతూ రైతులు దళారులకు వరి ధాన్యాన్ని అమ్ముకొని నష్ట పోకుండా ఉండడానికి ప్రభుత్వం కరోనా సమయంలో కూడా సరైన మద్దతు ధరతో ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందన్నారు. రైతుల దగ్గర ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేపట్టాలన్నారు. అనంతరం గ్రామంలోని గర్భిణీలకు బాలామృతం ద్వారా అందించే పౌష్టికాహారం ప్యాకెట్లను పంపిణీ చేశారు. వీరి వెంట సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, సర్పంచ్ బాబురావు, ఏ ఈ ఓ శృతి, రమణ, నాయకులు బద్రి సత్యనారాయణ,  రైతులు పాల్గొన్నారు.