హూజూరాబాద్ ఉపఎన్నికను భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముమ్మరంగా ప్రచారం

Published: Thursday October 28, 2021
బాలాపూర్, అక్టోబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : అక్టోబర్ 30న జరిగే ధర్మయుద్ధంలో ఈటల రాజేందర్ ని అత్యధిక మేజార్టీతో గెలిపించాలని కేంద్రమంత్రి జీ. కిషన్ రెడ్డి హుజురాబాద్ ఓటర్లను కోరారు. మంగళవారం జమ్మికుంట మండలం వావిలాల, నాగంపేట్, కోరపల్లిలో జరిగిన రోడ్డుషో, బహిరంగ సభలో ఆయన టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరువ్యాపారం చేసి పైకి వచ్చిన ఈటెల రాజేందర్ పై సీఎం కేసీఆర్ కుటుంబం కుట్రలు చేస్తోందన్నారు. వేలా కోట్ల అక్రమ ఆస్తులు సీఎం కేసీఆర్ సహా కుటుంబ సభ్యులు ఏ వ్యాపారం చేసి కూడబెట్టారో ప్రజలకు జవాబు చెప్పాలని కిషన్ రెడ్డి  డిమాండ్ చేశారు. కుటుంబ పాలనకు ఆత్మగౌరవానికి... ఆరాచకత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతున్న యుద్ధం అన్నారు.హూజూరాబాద్ లో జరుగుతున్న ప్రచారంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్, రాష్ట్ర నాయకులు ఎల్మేటి దేవేందర్ రెడ్డి, అమరేందర్ రెడ్డి, మాదారం రమేశ్ గౌడ్, మెహబత్ నగర్ శ్రీరాములు యాదవ్, బాలరాజు, బ్యాంకు డైరెక్టర్ పర్వతాలు, రఘువీర్, జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు అనితా, జీఎస్ ఇందిరా సహా బీజేపీ, బీజేవైఎం, మహిళా మోర్చా నాయకురాళ్లు, పాల్గొన్నారు. హుజూర్ బాదులో రంగారెడ్డి జిల్లా అధికార ప్రతినిధి మీర్ పేట్ మద్ది రాజశేఖర్ రెడ్డి, ఇంటింటి ప్రచారం చేసి ఈటల రాజేందర్ గెలిపించాలని కోరారు.