పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బూర్గంపాడు మండల కాంగ్రె

Published: Wednesday November 09, 2022
 బూర్గంపాడు ( ప్రజాపాలన.)
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న నేత ఎనుముల రేవంత్ రెడ్డి అని, ప్రస్తుతం ఆయన పేరు వింటేనే అధికార బిజెపి  పార్టీకి వెన్నులో వణుకు పుడుతుందని, సాధారణ జడ్పిటిసి స్థాయి నుంచి రాష్ట్రస్థాయి లీడర్ గా ఎదిగిన ఆయన జీవితం ఎందరికో ఆదర్శమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా బి బ్లాక్ అధ్యక్షరాలు బర్ల నాగమణి, బూర్గంపాడు టౌన్ అధ్యక్షులు మంద నాగరాజు ,సీనియర్ నాయకులు పాశికంట నాగ మురళి పూలగొండ ప్రభాకర్, భాగి వెంకట్రావు, మాదిశెట్టి లక్ష్మణరావు గోనెల సడాలు ఎస్కే చోటే కువారపు వెంకటేష్ మహిళ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి పుట్టి లక్ష్మి, రాసమల్ల కమల ,బాసిబోయిన పాపారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.